మాడ్గుల, ఏప్రిల్, 26 : బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వారికి పార్టీ బీమా పథకం కొండంత భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఇటీవల మృతి చెందాడు. అతడికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున మల్లయ్యకు మంజూరైన రూ.2 లక్షల చెక్కును మృతుడి భార్యకు ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం సైనికుడి లాగా పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్టాబీ రాంరెడ్డి, మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, జంగయ్య యాదవ్, శివరాజ్, కడారి అల్లాజీ, మహేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ ప్రతినిధుల సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించడంతో బుధవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ని వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి గ్రామాల్లో చర్చించాలన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బసవేశ్వరుడి బోధనలు ఆచరణీయం
బసవేశ్వరుడు కుల, వర్ణ, వివక్ష లేని సమాజ స్థాపనకు కృషి చేసిన సమతామూ౦ర్తి అని, ఆయన బోధనలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం ఆమనగల్లు మండల పరిధిలోని అయ్యసాగర క్షేత్రంలో బసవ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో అధికారికంగా జసవేశ్వరుడి జయంతిని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.70 లక్షలతో బసవేశ్వరుడి కాంస్య విగ్రహన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అనంతరం బసవేశ్వరుని ప్రతిమకు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.