పరిగి : వందశాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకోని వారందరికీ వ్యాక్సిన్ వేయించాలని, రెండో డోసు సమయం వచ్చిన వెంటనే సంబంధిత వ్యక్తులకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లిన వారికి సైతం ఫోన్ చేసి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా చెప్పాలన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే కొత్త వేరియంట్ వైరస్ సోకినా ప్రాణాపాయం లేకుండా బయట పడొచ్చని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో శానిటైజేషన్ చేపట్టాలని సూచించారు. పరిగిలోని ప్రభుత్వ దవాఖానలో ఆర్టీపీసీఆర్ పరీక్షలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీడీవో శేషగిరిశర్మ, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, డాక్టర్ సత్యనారాయణషిండె పాల్గొన్నారు.