కులకచర్ల, జనవరి 8: బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు గడపగడపకూ తీసుకెళ్లాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా ఇష్టపడుతున్నారని తాము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే సంక్షేమ పథకాలను పొందేవారమని అంటున్నార న్నారు.
డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ప్రతి సమస్యనూ గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామాలవారీగా సమస్యలను ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ కార్యకర్తల ద్వారా తెలుసుకున్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, జిల్లా నాయకుడు కొప్పుల అనిల్రెడ్డి, ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్ నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొత్తబలిజ రాజు, వైస్ ఎంపీపీ రాజశేఖర్గౌడ్, పాంబండ దేవాలయ చైర్మన్ రాములు, పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్య క్షుడు రాంలాల్, బీఆర్ఎస్ మండల నాయకులు కనకం మొగులయ్య, సారా శ్రీనివాస్, అంతారం మొగులయ్య, రాజప్ప, ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య, మాలె కృష్ణయ్యగౌడ్, నర్సింహులు, కొండయ్య, కో-ఆప్షన్ సభ్యుడు జుబేర్, దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.