పరిగి, నవంబర్ 9 : బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువా రం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మండలంలోని ఇబ్రహీంపూర్కు చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్, నాయకులు శ్రీను, శివకుమార్, అనంతయ్యతోపాటు వారి అనుచరులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దోమ : మండల పరిధిలోని మోత్కూరుకు చెంది న ఉపసర్పంచ్, బీజేవైఎం వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం శ్రీకాంత్రావు, మాజీ సర్పంచ్ నాగేశ్వర్రావుతో పాటు 60మంది నాయకులు గురువారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారి కి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అలాగే బాస్పల్లి, జహంగీర్సాబ్ తం డాకు చెందిన పలువురు యువకులు జడ్పీటీసీ నాగిరెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, పార్టీ అధ్యక్షుడు గోపాల్గౌడ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, యువ నాయకులు మశ్చేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, మోత్కూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశ్, శశిధర్రెడ్డి, సుధాకర్రెడి, సలీం, తజ్జమూల్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.