పరిగి, అక్టోబర్ 22: సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం కేసీఆర్ పాలన ఉండాలని ప్రజ లంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం పరిగిలోని ఎస్ గార్డెన్లో మండల, పరిగి పురపాలక సంఘం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడు తూ తెలంగాణ రాకముందు, సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలలో జరిగిన అభివృద్ది, పేదలకు అందిన సంక్షేమ పథకాలపై బేరీజు వేసుకోవాలన్నారు. ఈసారి ఎన్నికల తర్వాత కరోనా సంక్షోభంతో కొంత ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను ఏనాడు ఆపలేదని ఆయన గుర్తు చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తితో పరిగి నియోజకవర్గ భూములు సస్య శ్యా మలం అవుతాయన్నారు. ఉద్దండాపూర్ ప్రాజెక్టు నుంచి నీరు పరిగి నియోజకవర్గంలోని గ్రామాలకే మొదట అందుతాయని చెప్పారు. ఇటీవల కాలువల నిర్మాణానికి టెండర్లు పూర్త య్యాయని, తద్వారా నియోజకవర్గంలో లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు చెరువులన్నింటినీ కృష్ణా నీటితో నింపడం ద్వారా మరో లక్ష ఎకరాలకు సాగునీరు అం దించనున్నట్టు తెలిపారు. పరిగి పట్టణ అభివృద్దికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మొదటి విడతలో రూ. 15కోట్లు మంజూరు చేయించగా పనులు పూర్తి కావచ్చాయన్నారు. ఇటీవల రూ.25కోట్లు మంజూరు చేయగా టెండర్లు పిలిచారని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. 11 పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీ పేదలను పట్టించుకోలేదని, ఆనాడు ఏమి చేయనివారు నేడు ఆరు గ్యారంటీలంటూ వస్తే ప్రజలు నమ్మడం లేదన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన అయిదు గ్యారంటీలే అమలు కావడం లేదంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారన్నారు. తమ కుటుంబంతో కార్యకర్తలకు 40 సంవత్సరాల అనుబంధమని, తమ కుటుంబసభ్యుడిగా మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. పరిగిలోని ఆసుపత్రిని 50 పడకలకు పెంచి కొత్త భవనం నిర్మాణం చేపట్టడంతోపాటు ఇటీవల 100 పడకలకు అప్గ్రేడ్ చేయడ మైందని, డయాలసిస్ సెంటర్తో పేదలకు ఉచితంగా సేవలు అందుతున్నాయని తెలిపారు. రూ.30కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా నియోజకవర్గంలోని పేదలకు అందించడం జరిగిందన్నారు.
ఎమ్మెల్యే సతీమణి ప్రతిమారెడ్డి మాట్లాడుతూ ఇకమీదట తాను పరిగిలోనే పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మీరు ఎన్నికల్లో చేసిన సేవ కంటే రెండింతలు మీకు సేవ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, సీనియర్ నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, మాజీ ఎంపీపీ కల్లు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మీర్ మహమూద్అలీ, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, సుభాష్ చందర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, భాస్కర్,వెంకటయ్య, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్య క్షుడు అశోక్వర్దన్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలలో భాగంగా పరిగి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో గల దుర్గామాత ఆలయంలో ఆదివారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీపీ అరవిందరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
పరిగి టౌన్ : మాలల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని శారదా గార్డెన్లో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. మాలల అభివృద్దికి రాష్ట్ర ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ రజినిసాయిచంద్ మాట్లాడుతూ మాలలు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, ఓయూ జేఏసీ కన్వీనర్ మందాల భాస్కర్, రాష్ట్ర వేతనాల కమిటీ చైర్మన్ నారాయణ, సమతా సైనిక్దళ్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు రేంజర్ల రాజేష్, మాల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలకిషన్ పాల్గొన్నారు.