తాండూరు/కొడంగల్, ఏప్రిల్ 13 : రాష్ట్రంలోని 23,975 గ్రామాలకు 37,002 ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు.. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం తాండూరు కాగ్నానది, పంప్హౌస్ను సంబంధిత శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించి.. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత వేసవిలో తాగునీటి సరఫరా అత్యంత కీలకమ న్నారు. నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తాగునీటికి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని సారించిందన్నా రు. నీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం లో రూ.100 కోట్ల నిధులతో 19,605 చేతిపంపులు, 14,708 సింగిల్ఫేస్, 5 హెచ్పీ పంపుసె ట్లు, 605 మంచినీటి బావులు, 662 కిలోమీటర్ల ఇంట్రా పైపులైన్లకు మరమ్మతులతో పాటు పలు పనులు పూర్తైనట్లు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో రూ. 3.54 కోట్లతో 1,044 పంపుసెట్లు, 495 చేతిపంపులకు మరమ్మతులు చేయించామన్నారు. తాండూరు కాగ్నానది నుంచి కొడంగల్, యాలా ల మండలాల పరిధిలోని గ్రామాలకు మంచినీటి కల్పనకు కాగ్నానది ఇంటెక్వెల్ను 2.5 ఎం ఎల్డీ పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. గ్రామాల్లో నీటి స్వచ్ఛతను తెలుసుకునేందుకు ప్రతి గ్రామానికీ క్లోరోస్కోప్ కిట్లను పంపి ణీ చేశామని.. అవసరమున్న గ్రామాల్లో పశువులకు నీటి తొట్టెలను కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ నీటి సమస్య ఉన్నా 24 గంటల్లో పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తాగునీటి సరఫరా అంశం పై సీఎంతో సహా చీఫ్ సెక్రటరీ కూడా ప్రతిరోజూ రివ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తాగునీటి సరఫరాలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేయడంతోపాటు.. సంప్హౌస్ల్లో లోవోల్టేజీ సమస్య తలెత్తకుండా 72 ప్రాంతాల్లో వోల్టేజీ స్టెబిలైజర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అనంతరం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యం త్రాంగం చురుకుగా పని చేస్తున్నదని.. ప్రతిరో జూ తాగునీటిపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మిషన్ భగీరథ ఇంజినీర్ చీఫ్ కృపాకర్రెడ్డి, చీఫ్ ఇంజినీర్ చెన్నారెడ్డి, ఎస్ఈ ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బాబు, శ్రీనివాస్, చల్మారెడ్డి, వెంకటర మణ, జడ్పీ సీఈవో సుధీర్, డీపీవో జయసుధ, డీఆర్డీవో శ్రీనివాస్ తదితరులున్నారు.