కోట్పల్లి, ఫిబ్రవరి 25: ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇందోల్ గ్రామం లో రూ. 15 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. లింగం పల్లి గ్రామంలో రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు, బుగ్గాపూర్లో రూ. ఐదు లక్షలతో చేపట్టిన సైడ్డ్రైన్లు కోట్పల్లిలో రూ. ఐదులక్షలతో సైడ్డ్రైన్లు, ఐదులక్షలతో సీసీ రోడ్డు, ఓగ్లాపూర్ గ్రామంలో ఐదు లక్ష లతో సైడ్డ్రైన్లు, అన్నాసాగర్లో రూ.10 లక్షలతో సైడ్డ్రైన్లు, ఇందోల్ గ్రామంలో రూ. ఐదులక్షలతో సైడ్డ్రైన్లు, మొత్తం రూ. 50లక్షలతో నిర్మించిన పనులను శనివారం తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్నట్టు టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు పేర్కొన్నారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కింద విడుదలైన రూ. 42 లక్షల పనులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి శంకు స్థాపన చేయనున్నారని ఆయన తెలిపారు.