అబ్దుల్లాపూర్మెట్, మే 10 : తెలంగాణ ఉద్యమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు పల్లె రవికుమార్గౌడ్ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నగరానికి వెళుతున్న సందర్భంగా అబ్దుల్లాపూర్మెట్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూజగ్జీవన్రామ్, లష్కర్గూడలోని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ విగ్రహాలకు బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గీతపనివారల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించిన బొమ్మగాని ధర్మభిక్షంను స్ఫూర్తిగా తీసుకొని గీత కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్తో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. గీత పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్గౌడ్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన రవికుమార్ జర్నలిస్టుగా రాణించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన వంతు ముఖ్యపాత్రను పోషించారని గుర్తు చేశారు. అనంతరం ఎంపీటీసీ సీక సాయికుమార్గౌడ్ రవికుమార్గౌడ్ను సన్మానించారు. కార్యక్రమంలో రచయిత కేవీఎల్, నాయకులు వినయ్కుమార్గౌడ్, దేవేందర్గౌడ్, శ్రీనివాస్, బాల్రాజ్గౌడ్, ఎంపీటీసీ భాస్కర్గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రవీందర్, ఆర్కే లింగంగౌడ్, శ్రీకాంత్గౌడ్, మహేందర్, అనీల్, సాయి, శంకర్ పాల్గొన్నారు.