తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయి.అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు రాష్ట్ర సర్కార్ అవార్డులను ప్రకటించింది. 9 అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు రంగారెడ్డిజిల్లాలో 27 గ్రామ పంచాయతీలను ఉత్తమ జీపీలుగా ఎంపిక చేశారు. త్వరలో జిల్లా స్థాయిలో అవార్డులు అందించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
షాబాద్, మార్చి 26: రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో మొత్తం 558 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించిన గ్రామాలకు ప్రగతి పుర స్కారాలు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు అవార్డులు అందను న్నాయి. మొత్తం తొమ్మిది అంశాలలో…మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన వాతా వరణం, తాగునీటి సమృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, స్వయం ఉపాధి, సామాజిక భద్రత, మెరుగైన పాలన, మహిళా స్నేహ పూర్వక పంచాయతీ వంటి అంశాల్లో సర్వే చేసిన అధి కారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ క్రమంలో జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామాలు, పల్లెప్రకృతివనాలు, నర్సరీలు, సీసీ రోడ్లు, పరిశుభ్రత అంశాలను పరిశీలించిన పంచా యతీ రాజ్ శాఖ అధికారులు ఉత్తమ పంచాయతీలకు అవార్డులు అందించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గ్రామాలన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. గత పాలకుల హయాంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలన్నీ…నేడు ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయి.దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో హరితహారం నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్యార్డులు, రైతువేదికలు తదితర పనులు చేపట్టడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారి పోయాయి. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు బాగా జరిగిన గ్రామ పంచాయతీలకు ఇప్పటికే మండల స్థాయిలో అధికారులు ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేసి, అవార్డులు అందజేశారు. త్వరలో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన పంచాయతీలకు అవా ర్డులు అందించనున్నారు. ఇందులో నుంచి కొన్ని జీపీలు రాష్ట్ర స్థాయిలో అవార్డులకు ఎంపిక కానున్నాయి. అభి వృద్ధిని గుర్తించి ప్రభుత్వం జీపీలకు అవార్డులు అందించడం సంతోషకరమని, గ్రామాలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలు ఉత్తమ పంచా యతీ లుగా ఎంపిక య్యా యి. ప్రభుత్వ ఆదేశానుసారం మొత్తం తొమ్మిది అంశాలను పరిశీలించి ఉత్తమ పంచా యతీలుగా ఎంపిక చేశాం. అభివృద్ధి పనుల ఆధారంగా అధికారుల బృందం పరిశీ లించి నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం పారదర్శకంగా ఉత్తమ గ్రామ పం చాయతీలను ఎంపిక చేసింది. త్వరలో అవార్డులు అందిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం
-శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డిజిల్లా పంచాయతీ అధికారి