పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ప్రజల కల సాకారమైంది. ప్రాజెక్టుల నిర్మాణాలతో తాగు, సాగు నీటికీ కొదువలేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాబోయే తరాలకు బంగారు భవితకు బాటలు వేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొని పర్యావరణ అనుమతులు పొంది నేడు ప్రాజెక్టుని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఉమ్మడి జిల్లాలోని జనం ఉప్సెనలా తరలివెళ్లారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఏ పల్లెలో చూసినా బస్సులు కిక్కిరిసిపోయాయి. పాలమూరుతో మన జిల్లాలు సస్యశ్యామలం కానున్న నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లను చూసి అన్నదాతలు పరవశించిపోయారు. సీఎం కేసీఆర్ ప్రసంగం విన్న జనం హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. సభకు వెళ్లే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, మినరల్ వాటర్ తదితర వసతులను సమకూర్చారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
పల్లెపల్లెకు ప్రాజెక్టు నీరు..
ప్రాజెక్టుల నిర్మాణాలతో ప్రతి పల్లెకు సాగునీరు అందనున్నది. పల్లెపల్లెనా పచ్చని పంటలు తెలంగాణలోనా.. అని పాడుకునే రోజులు రాబోతున్నాయి. గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్.
– గడ్డం రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకురాలు(నందిగామ)
సాగునీటి కష్టాలు తప్పినట్లె..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాలమూరు ప్రజల సాగునీటి కష్టాలు తప్పినట్లే. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేర్లు చెప్పుకుని ఓట్లు వేయించుకున్నారు తప్ప, నిర్మాణం పూర్తి చేయలేదు. సీఎం కేసీఆర్ పట్టుదలతో ప్రాజెక్టులను నిర్మించారు.
– జంగ శ్రీనివాస్, జంగోనిగూడ (నందిగామ)
ప్రాజెక్టును చూడటం సంతోషంగా ఉన్నది..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చూడటం సంతోషంగా ఉన్నది. చేవెళ్ల నుంచి సభకు భారీగా తరిలివెళ్లాం. పాలమూరు ప్రాజెక్టుతో తాగు, సాగు నీటి కష్టాలు తప్పనున్నాయి. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– మాధవ గౌడ్, చేవెళ్ల, (చేవెళ్లటౌన్)
లక్షలాది ఎకరాలకు సాగునీరు..
పాలమూరుకు వెళ్లేందుకు ప్రభుత్వమే వసతులు కల్పించి తీసుకువెళ్లడం సంతోషంగా ఉన్నది. పాలమూరు ఎత్తిపోతలతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనున్నది.
– నరహరి రెడ్డి, దేవరంపల్లి గ్రామ సర్పంచ్, చేవెళ్ల మండలం(చేవెళ్లటౌన్)
రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంతో రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో స్వపరిపాలన కొనసాగుతున్నది. సాగు నీటి ప్రాజెక్టులతో రాబోయే తరాలకు ఉపాధి లభించనున్నది. ఇలాంటి సీఎం ప్రజలకు అవసరం.
– ఎం డేవిడ్, అజీజ్నగర్ (మొయినాబాద్)
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ప్రతి గుంటకు సాగునీరు అందనున్నది. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నల కష్టాలు తొలగనున్నాయి. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– శ్రీనివాస్యాదవ్, సర్పంచ్ కొండన్నగూడ గ్రామం, ఫరూఖ్నగర్ మండలం(షాద్నగర్టౌన్)
చాలా సంతోషంగా ఉన్నది..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సభకు వెళ్లడం సంతోషంగా ఉన్నది. ప్రాజెక్టు చూసేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
– లక్ష్మమ్మ, కొండన్నగూడ గ్రామం, ఫరూఖ్నగర్ మండలం (షాద్నగర్టౌన్)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉండాలి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లా ప్రజలు జీవితాంతం రుణపడి ఉండాలి. నెర్రెలు వారిన భూములు సాగులోకి రానున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం. మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.
– రాఘవేందర్రెడ్డి, మహలింగాపూరం(శంకర్పల్లి)
ప్రతి గుంటకు సాగునీరు..
పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి గుంటకు సాగునీరు అందనుండడం సంతోషంగా ఉన్నది. గొప్ప ప్రాజెక్టును నిర్మించిన సీఎం కేసీఆర్ సార్ను చూసేందుకు నేను వెళ్లాను. మా గ్రామంలో బస్సును ఏర్పాటు చేయడంతో అందరం కలిసికట్టుగా వెళ్లాం.
– మంజుల, చిల్కమర్రి గ్రామం, ఫరూఖ్నగర్మండలం(షాద్నగర్ రూరల్)
పాలమూరుతో 330 గ్రామాలకు లబ్ధి..
పాలమూరు ఎత్తిపోతలతో రంగారెడ్డి జిల్లాలోని 330 గ్రామాలకు లబ్ధి చేకూరనున్నది. అద్భుత ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు గ్రామస్తులకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉన్నది.
– బాలయ్య, మధురాపూర్, ఫరూఖ్నగర్ మండలం (షాద్నగర్ రూరల్)
అపర భగీరథుడు సీఎం కేసీఆర్..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్. అకుంఠిత దీక్షబూని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సార్కే దక్కుతుంది. మా కొత్తూరు ప్రాంతానికీ నీళ్లు వస్తాయని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉన్నది. ప్రాజెక్టును చూసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉన్నది.
– చాంది, మల్లాపూర్ తండా(కొత్తూరు)
ఇలాంటి సీఎం ఉండటం మన అదృష్టం..
మన రాష్ర్టానికి ఇలాంటి సీఎం ఉండటం మన అదృష్టం. ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం నిర్మిస్త్తే్త.. దక్షిణ తెలంగాణకు పాలమూరు ప్రాజెక్టును నిర్మించారు. తాగు, సాగు నీటికి ఇబ్బంది లేదు. మన పొలాలకు నీరు వస్తే పుష్కలంగా పంటలు పండనున్నాయి.
– చిర్ర అబ్రహం, మల్లాపూర్ (కొత్తూరు)
బంగారు పంటలు పండనున్నాయి..
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు ప్రాజెక్ట్తో రెండు జిల్లాల్లో బంగారు పంటలు పండనున్నాయి. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ప్రాజెక్టు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా రైతన్నలు ఎదురుచూస్తున్న అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైనది.
– జితేందర్రెడ్డి, రావిచేడ్ గ్రామం, (కడ్తాల్)
దశాబ్దాల కల సాకారమైంది..
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు దశాబ్దాలుగా కన్న కల సాకారమైంది. సాగు నీరు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. బతుకుదెరువుకు వలస పోయి అవస్థలు పడ్డారు. పాలమూరు ఎత్తిపోతలతో లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
– శ్రీనునాయక్, పుల్లేర్బోడుతండా, (కడ్తాల్)
ఇబ్రహీంపట్నంలోని బీడు భూములు సాగులోకి..
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని భూములు పచ్చని పంటపొలాలుగా మారనున్నాయి. పట్టువీడని విక్రమార్కుడిలా ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు (ఇబ్రహీంపట్నం)
సాగునీరు పుష్కలం..
గతంలో సాగునీరులేక పాలమూరు ప్రాంతం బీడువారింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి త్వరలో సాగునీరు పుష్కలంగా అందనున్నది.
– రవణమోని జంగయ్య ముదిరాజ్(ఇబ్రహీంపట్నంరూరల్)
అపర భగీరథుడు సీఎం కేసీఆర్..
అపర భగీరథుడు సీఎం కేసీఆర్. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో తెలంగాణ వ్యాప్తంగా బంగారు పంటలు పండనున్నాయి. కేసీఆర్ మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం.
– అచ్చన శ్రీశైలం, ఎంపీటీసీ రాయపోల్ (ఇబ్రహీంపట్నం రూరల్)