కేశంపేట, నవంబర్ 22 : రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే కఠిన చర్యలు తప్పవని షాద్నగర్ ట్రాఫిక్ సీఐ శ్రీశైలం హెచ్చరించారు. కేశంపేట మండలం సంతాపూర్లో బుధవారం రైతులకు రోడ్లపై ధాన్యం ఆరబోస్తే జరిగే ఇబ్బందులపై ఆయన అవగాహన కల్పించారు. మంగళవారం కొందరు రైతులు ధాన్యాన్ని రోడ్డుపై ఆరబోయడం వల్ల ఆటో ఆదుపుతప్పి బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. మరి కొందరికి గాయాలయ్యాయి.
ఈ సంఘటనపై స్పం దించిన సీఐ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు జారి పడి ప్రమాదాల బారిన పడటంతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రైతులు పంట ధాన్యాన్ని కల్లాలు, ఆరుబయట పొలాల్లో పోసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.