వరుస చేరికలతో బీఆర్ఎస్ జోరు కొనసాగుతుండగా.. విపక్షాలు బేజారవుతున్నాయి. శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరారు. సీపీఎంకు చెందిన రంగారెడ్డిజిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహతోపాటు మాజీ కార్యదర్శి జంగయ్య, ఇతర సీనియర్ నాయకులు తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. త్వరలోనే మరింత మంది గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8 : నియోజకవర్గం లో బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సీపీఎం రంగారెడ్డిజిల్లా ఉపాధ్యక్షుడు, యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన ఎంపీ నర్సింహ, పార్టీ మాజీ కార్యదర్శి ఎంపీ జంగయ్య, పార్టీ సీనియర్ నాయకుడు సామియల్, వార్డు సభ్యు డు వెంకటేశ్తోపాటు మరో 50 మంది ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. గతవారం రోజులుగా నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇబ్రహీంపట్నానికి చెం దిన నలుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధితోపాటు నాగన్పల్లి గ్రామానికి చెందిన వార్డుసభ్యులు, ఇతర గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్కు చెందిన అనేకమంది బీఆర్ఎస్లో చేరారు.అలాగే, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్పార్టీ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. అలాగే, అబ్దుల్లాపూర్మెట్, యాచారం మండలాలతోపాటు పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ నుంచి అధిక సంఖ్యలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కృషికి ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు. చేరిన వారందరికీ తగిన గుర్తింపు లభిస్తుందని.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ మరింత కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభు త్వం హ్యా ట్రిక్ విజయం చేస్తుందని.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాచారం మండలాధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాష, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.త్వరలో మరిన్ని చేరికలు.. నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు అనేక మంది రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులతోపాటు కొంతమంది కౌన్సిలర్లు కూడా పార్టీ లో చేరుందుకు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్ ము న్సిపాలిటీల్లో పదిమంది కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. త్వర లో ఆదిబట్ల, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీల నుంచి కూడా పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల నుంచి ఆ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీల నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాడర్, నాయకులను కారులో ఎక్కించేందుకు బీఆర్ఎస్ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరిన్ని గడ్డు పరిస్థితులు రానున్నాయి.