కొండాపూర్, జనవరి 13 : మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా శనివారం గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవరులు, కొమ్ముదాసరులు, సోదమ్మ, పిట్టల దొరల వంటి జానపద కళారూపాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
అనంతరం విదూషి అపర్ణ శంకర్, సుష్మిత శిష్య బృందాలు ప్రదర్శించిన నృత్యరూపకాలు అలరించాయి. ఆదివారం భోగి పళ్ల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.