శంకర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం 50రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మున్సిపల్ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో అలారా డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు మాట్లాడుతూ నగరంలోని పలు వార్డుల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందిస్తున్నారని తెలిపారు. కాగా శంకర్పల్లిలో ఏర్పాటు చేసి ‘ఆలారా’ మెడికల్ డయాగ్నస్టిక్ సెంటర్ వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
నగరానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడం వేల రూపాయలతో కూడుకున్న పని అని అన్నారు. ఇందుకోసం డయగ్నాస్టిక్ డాక్టర్లు కిషోర్గౌడ్, రమేశ్గౌడ్ ఈ మెడికల్ డయగ్నాస్టిక్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అంతకు ముందు చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి ఆలారా మెడికల్ డయగ్నాస్టిక్ సెంటర్కు వచ్చి వెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ నర్సింహులు, నాయకులు రాజేశ్గౌడ్, సురేశ్గౌడ్, వెంకట్రెడ్డి, జనార్దన్రెడ్డి, డాక్టర్లు శశిరేఖారెడ్డి, రాంచందర్, గంగాధర్, హరీశ్ పాల్గొన్నారు.