కొత్తూరు, జూన్ 19: కంటి వెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో కౌన్సిలర్ బ్యాగరి ప్రసన్నలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కంటి వెలుగును అర్హులందరూ ఉపయోగించుకోవాలన్నారు. కంటి వెలుగు ద్వారా ఉచిత పరీక్షలతో పాటు అద్దాలు, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, డా. హరికృష్ణ, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, బ్యాగరి యాదయ్య, జనార్దనాచారి, జంగగళ్ల శివకుమార్, దాసరి నర్సింహ, లక్ష్యయ్య, నర్సింహ, ప్రభు మాస్టర్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని మల్కాపూర్, చన్వెల్లి గ్రామాల్లోని కంటి వెలుగు శిబిరాల్లో సోమవారం గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు, మందులు ఉచితంగా అందించారు. మల్కాపూర్ గ్రామంలోని కంటి వెలుగు శిబిరంలో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 28 రీడింగ్ గ్లాసెస్, 14 ప్రిస్క్రిప్షన్ (అద్దాలు ఆర్డర్) చేశారు. చన్వెల్లి గ్రామంలోని కంటి వెలుగు శిబిరంలో 129 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 7 రీడింగ్ గ్లాసెస్, 5 ప్రిస్క్రిప్షన్ (అద్దాలు ఆర్డర్) చేశారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు వైద్యులు, డీఈవోలు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : కంటి వెలుగు కార్యక్రమం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని కౌన్సిలర్ ఉదయశ్రీ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ సూరజ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ, నాయకులు గోపాల్రెడ్డి, కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.