తాండూరు, ఫిబ్రవరి 15 : గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సేవాలాల్ జయంతిని తాండూరు నియోజకవర్గంలో నిర్వహించారు. తాండూరు పట్టణంలోని సేవాలాల్ విగ్రహానికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో పాటు గిరిజన నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతిని నిర్వహిస్తుందన్నారు. ప్రతి తండాకు బీటీ రోడ్లు, పంచాయతీల భవనాల నిర్మాణం చేపడుతామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ వసతి గృహాలతో పాటు విదేశాల్లో ఉన్నత చదువులకు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వెనుక బడిన కులాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తాండూరులో బంజారా భవన నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ సేవాలాల్ గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. పెద్దేముల్ జడ్పీటీసీ ధారాసింగ్, బంజారా సంఘం నాయకులు, విఠల్నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ వేడుకలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.
పెద్దేముల్ : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ సేవలు చరిత్రాత్మకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఊరెంటితండా గ్రామంలో సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని స్థానిక జడ్పీటీసీ ధారాసింగ్, స్థానిక నాయకులతో కలిసి సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ సంస్కరణలను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో కొనసాగాలన్నారు.
అనంతరం గ్రామంలో భవనీమాత, సేవాలాల్ మహరాజ్ మందిరాల వద్ద నిర్వహించిన భోగ్ భండార్లో పాల్గొని పూజలు చేశారు. అదే విధంగా సేవాలాల్ మహరాజ్ జెండాను గ్రామస్తులు, గిరిజనులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ టోప్యానాయక్, ఉపసర్పంచ్ నగినాగోపాల్ నాయక్, జడ్పీటీసీ ధారాసింగ్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధన్సింగ్, నాయకులు మహిపాల్ రెడ్డి, జితేందర్రెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రాంనాయక్, నర్సింహులు, గోపాల్, రామునాయక్, బాబూసింగ్, శోభమ్మ, రవినాయక్, నర్సింగ్ నాయక్, రతన్, జయరాం, తుకారం, ఢాకునాయక్, నవీన్ జాదవ్, గిరిజన నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బషీరాబాద్ : యువత సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలని తాండురు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతనం ఏర్పాటు చేసిన సభలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాకు సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు రూ.50 లక్షలను మంజూరు చేయాలన్న విషయాన్ని ముఖ్యమంత్రికి యావత్ గిరిజన సోదరుల తరఫున తెలియజేశానన్నారు. వచ్చే సంవత్సరం నుంచి అధిక నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. గిరిజన తండాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు త్వరలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ముందుకు సాగుతానన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కరుణ, సేవాలాల్ కమిటీ అధ్యక్షుడు రామునాయక్, ఉపాధ్యక్షుడు బన్సీలాల్, ప్రధాన కార్యదర్శి నరేశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, నాయకులు రోహిత్ మహరాజ్ పాల్గొన్నారు.
కులకచర్ల : గురువారం కులకచర్ల మండల కేంద్రంలో ససంత్సేవాలాల్ మహరాజ్ జయంతిని గిరిజనులతో కలిసి కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, నాయకులు జానకీరాం, శివరాంనాయక్, రాజేందర్, వివిధ గ్రామాల గిరిజన సంఘాల నాయకులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు. తుపాకుల తండాలో కులకచర్ల మండల పరిధిలోని తుపాకుల తండాలో సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
పరిగి, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పరిగిలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జయంతిని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని గుర్తు చేశారు.
గిరిజనులు మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎ.సురేందర్, బీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, మాజీ సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సంతోశ్, కౌన్సిలర్లు నాగేశ్వర్, వెంకటేశ్, నాయకులు బి.రవికుమార్, తాహేర్, సేవ్యానాయక్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.