వికారాబాద్, జనవరి 16: కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివరాలను తయారు చేసుకుని శిబిరాలను నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో 120-130 మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ, జిల్లా ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బిల్ కలెక్టర్లు, వార్డు, మెడికల్ అధికారులు, మెడికల్ సూపర్వైజర్లు, పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అదేవిధంగా మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జడ్పీటీసీలు, ఎం పీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యు లు, వీఆర్వోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డీలర్లను భాగస్వాములను చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు. కాగా అంతకుముందు కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జనవరి 18న ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని.. అందువల్ల జిల్లాల్లో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జడ్పీచైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వారి వారి పరిధిలో ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి బృందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా కలెక్టర్, డీఎంహెచ్వో వాట్సాప్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, వికారాబాద్ జిల్లా నుంచి డీఆ ర్వో అశోక్కుమార్, డీఎంహెచ్వో పాల్వన్కుమార్, డీపీవో తరుణ్కుమార్, అదనపు ఎస్పీ రషీద్, మున్సిపల్ కమిషనర్లు శరత్చంద్ర, శ్రీనివాసన్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 16: జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాట్లు చేస్తు న్నట్లు.. ఇందుకు 84 బృందాలను ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం నిర్వహించి న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అమయ్ కుమార్ అధికారులతో మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడుత ‘కంటి వెలుగు’ను ఈ నెల 19న మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేటలో ఉదయం 9 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
ఇప్పటికే జిల్లాకు 1,04,409 కంటి అద్దాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ కనీసం 120 నుంచి 130 మందికి నేత్ర పరీక్షలు చేసేలా ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 9నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా శిబిరాలు కొనసాగాలని, వైద్యబృందాలు ఉదయం 8.45 గంటలకు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉదయం 8 గంటలకే శిబిరాల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. అంతకుముందు మంత్రి హరీశ్రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి ‘కంటి వెలుగు’ అమలుపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి నిర్దేశిత ప్రాంతాల్లో శిబిరాలను ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీఎంహెచ్వో వెం కటేశ్వరరావు, డీపీవో శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఏ ప్రభాకర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.