వికారాబాద్, జనవరి 12 : కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో నలుగురు వ్యక్తులు 77కిలోల గంజాయిని తరలిస్తుండగా శుక్రవారం ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్చంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ర్టానికి చెందిన లడ్విన్ ఆనంద్, మున్నా వర్దన్, అజిత్రామ్, సామియల్ భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో 77కిలోల గంజాయిని తరలిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్, ఆర్పీఎఫ్ పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో దాడులు చేసి సుమారు రూ.20లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఎక్సైజ్ సీఐ రాఘవీణ, ఎక్సైజ్ ఎస్సై కోటేశ్వర్రావు, ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.