ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అందుబాటు లో ఉంచాలని అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం లో వరద ఉధృతి అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు ప్రవహిస్తున్నందున ప్రజలు అటువైపు వెళ్లవద్దని అన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఇబ్రహీంపట్నం, జూలై 27 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీల్లో ప్రత్యేక హెల్ప్లైన్లతో పాటు రెస్క్యూ ఆపరేషన్ టీంలను సిద్ధ్దంగా ఉంచారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఒక్క హెల్ప్లైన్ ఏర్పాటు చేసి రెండు రెస్క్యూ టీంలను కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో సహాయక చర్యలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం జంగాలబస్తీలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు నిల్వ ఉండటంతో ఆ నీటినంతా చిన్నచెరువు ఆయకట్టు ప్రాంతానికి తరలించారు. వివిధ కాలనీల్లో శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లను మున్సిపల్ సిబ్బందితో కూల్చివేయించారు. పలుచోట్ల విరిగిపడిన చెట్లను తొలగించారు. సహాయక చర్యలు అవసరమైనవారు 7675829268, 9866526452 నంబర్లను సంప్రదించాలని కమిషనర్ తెలిపారు. ఇబ్రహీంపట్నం సాగర్రోడ్డు నుంచి ఉప్పరిగూడవైపు వెళ్లే ప్రధానరోడ్డులో పెద్దచెరువు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగిస్తుండటంతో సర్పంచ్ రాంరెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో చెట్టును తొలగించారు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని కళానగర్లో ముంపునకు గురైన ప్రాంతాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ పరిశీలించారు. పలు మండలాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు సహాయక చర్యలు చేపడుతున్నారు.
నందిగామ : వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలల్లో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, నందిగామ సీఐ సురేశ్, తహసీల్దార్ రెహమాన్ ఖాన్తో కలిసి పర్యటించారు. వాగులు, చెరువులను పరిశీలించారు. నందిగామ నుంచి వీర్లపల్లి రోడ్డులో రాకపోకలు నిలిపి వేసినట్లు తెలిపారు.
కూలిన ఇండ్లు
వర్షాలతో మండలంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. నందిగామ గ్రామానికి చెందిన బిసా నర్సింహ, అబ్దుల్ రియాజ్ల ఇండ్లు కూలిపోయాయి. మామిడిపల్లికి చెందిన కృష్ణారెడ్డి, నర్సప్పగూడకు చెందిన అమిత్ పాషా ఇల్లు కూలిపోయినట్లు తహసీల్దార్ తెలిపార
అధికారుల ముందస్తు చర్యలు
కేశంపేట : కురుస్తున్న వర్షానికి చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. మండలంలోని వాగు పారుతుండటంతో ఎస్ఐ వరప్రసాద్ నేతృత్వంలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు చేపట్టారు. పాటిగడ్డ గ్రామ సమీపంలో వాగులో నీరు ఉధృతంగా పారుతుండటంతో ప్రజలు నీటి వద్దకు వెళ్లవద్దని ఎస్ఐ సూచించారు. వాగుపై ప్రజలు వెళ్లకుండా కంపను అడ్డంగా వేయించారు.
మున్సిపాలిటీలో కమిషనర్ పర్యటన
తుర్కయాంజాల్ : ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. చెరువులు, వాగులను చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, కౌన్సిలర్లు, పోలీస్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నచోట దాటడానికి ప్రయత్నించవద్దన్నారు.
అయ్యవారిపల్లి వాగులోకి భారీగా వర్షపు నీరు
షాద్నగర్రూరల్: ఫరూఖ్నగర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మండలంలోని చెరువులు, వాగులు నిండుకుండలను తలపిస్తున్నాయి. మండలంలోని అయ్యవారిపల్లి, నాగులపల్లి వాగుల్లోకి భారీగా వర్షం నీరు చేరడంతో పోలీసులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అయ్యవారిపల్లి వాగును గురువారం శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రంగస్వామి, సీఐ ప్రతాప్లింగం పరిశీలించారు. ముందస్తు చర్యలో భాగంగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. పురాతన ఇండ్లను ఖాళీ చేయాలన్నారు. అత్యవసర సమయంలో సమాచారం అందించాలన్నారు.
కళానగర్లోకి వరద
పెద్దఅంబర్పేట : భారీ వర్షాలతో ముంపు ముప్పు పొంచిఉన్నదని మున్సిపాలిటీలోని పలు కాలనీల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పసుమాముల కళానగర్లోకి వరద నీరు చేరుతున్నది. కాలనీలోని పలు రహదారులు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారిపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచింది. గురువారం ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ కళానగర్లో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. పెద్దఅంబర్పేట-కొహెడ మార్గంలోని చాకర వాగు వద్ద వరద నీరు ప్రవహిస్తున్నది. వరద నీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇక్కడ బ్రిడ్జి మంజూరు చేయగా.. పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో వరద కష్టాలు తీరిపోనున్నాయి.
అప్రమత్తతతోనే ప్రమాదాలు దూరం
కొత్తూరు : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తతతో ప్రమాదాలు ధరిచేరకుండా చూడవచ్చని శంషాబాద్ ఏసీపీ రాంచందర్రావు అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మక్తగూడ నందికట్లవాగును అధికారులతో కలిససి శంషాబాద్ ఏసీపీ రాంచందర్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్తగూడ నుంచి పిల్లోనిగూడ దారిలో నూతనంగా బ్రిడ్జి నిర్మిస్తున్నందున ఈ రోడ్డును మూసివేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శరత్చంద్రబాబు మాట్లాడుతూ ఈ రోడ్డులో నీటి ప్రవాహం అధికంగా ఉందని చెప్పారు. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో మక్తగూడ, పిళ్లోనిగూడ రహదారిని మూసివేశామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాములు, సీఐ శంకర్రెడ్డి పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి-సీఐ మన్మోహన్
అబ్దుల్లాపూర్మెట్ : భారీగా వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మోహన్ అన్నారు. వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. దీంతో గురువారం లష్కర్గూడ గ్రామంలోని వాగుని సీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సీక సాయి పాల్గొన్నారు.
నిండు కుండలా మూసీవాగు
శంకర్పల్లి : వికారాబాద్ నుంచి గండిపేట్ వరకు గల మూసీవాగు నిండుకుండలా ప్రవహిస్తున్నది. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని మూసీవాగును ఎంపీడీవో వెంకయ్య పరిశీలించారు. వాగుల వద్ద సెల్ఫీలు దిగవద్దని చెప్పారు. కార్యక్రమంలో గీత, నాగభూషణం పాల్గొన్నారు.
తంగడిపల్లి, దామరగిద్ద గ్రామాల్లో కూలిన ఇండ్లు
చేవెళ్ల రూరల్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేవరంపల్లి, దేవునిఎర్రవల్లి వాగులు వర్షంతో ఉప్పొంగాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తంగడిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి అంజమ్మ, దామరగిద్ద గ్రామానికి చెందిన బేజ వినోత ఇండ్లు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీవో విఠలేశ్వర్ జీ, పంచాయతీ కార్యదర్శి సురేందర్ రావు కూలిన ఇండ్లను పరిశీలించారు.
యాచారం : తమ్మలోనిగూడలో గురువారం ఎంపీడీవో విజయలక్ష్మి పర్యటించారు. గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కలను ఆమె పంపిణీ చేశారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. జీపీ రికార్డులను తనిఖీ చేశారు.
శంకర్పల్లి : భారీగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని మోకిల సీఐ నరేశ్ అన్నారు. ప్రొద్దటూర్ వాగును పరిశీలించి బందోబస్త్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ కృష్ణ పాల్గొన్నారు.
భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు
షాబాద్ : ఎట్ల ఎర్రవల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. షాబాద్ సీఐ యాదయ్యగౌడ్ అక్కడకు వెళ్లి ప్రజలను అప్రమత్తంగా చేశారు. అదే విధంగా పటేల్ గూడ గ్రామానికి చెందిన జుట్టు రమేశ్ ఇల్లు కూలిపోయింది. మండలంలోని ఆయా గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చందన్ వెళ్లి పెద్ద చెరువు అలుగు పారుతుంది.
బాధితులకు పునరావాస కేంద్రాలు
మంచాల : వివిధ గ్రామాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన ఇండ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఎంపీపీ నర్మద మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటి వరకు 10 ఇండ్లు కూలిపోయాయని, వారికి ప్రభుత్వ పరంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సుకన్య పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని అమ్డాపూర్ వద్ద ఈసీ నది గడ్డలు ఎక్కి ప్రవహించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈసీ వాగు పరిసర ప్రాంతాలైన పూడూరు, షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్లలో భారీగా వర్షాలతో వరద నీరు భారీగా వచ్చి చేరింది. వెంకటాపూర్ వద్ద మత్తడి ఉధృతంగా ప్రవహించింది. ఇరిగేషన్ అధికారులు పరిస్థితిని పరిశీలించారు.
ఉప్పొంగిన వెంకట్రెడ్డి వాగు
తుర్కయాంజాల్ : ఎడతెరిపిలేని వానలతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. తుర్కయాంజాల్ మాసాబ్ చెరువునకు వరద ఉధృతి పెరగడంతో పెద్దఎత్తున అలుగుపారుతున్నది. మున్సిపాలిటీ పరిధి కొహెడలోని వెంకట్రెడ్డి వాగు ఉప్పొంగడంతో తొర్రూరు-కొహెడకు వెళ్లే దారి పూర్తిగా మూసివేశారు.
మున్సిపాలిటీలో కమిషనర్ పర్యటన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీకాంత్ అన్నారు. చెరువులు, వాగులను చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, కౌన్సిలర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
చేపలను పట్టిన మత్స్యకారులు
షాద్నగర్టౌన్ : కురుస్తున్న వర్షంతో షాద్నగర్లోని మినీ ట్యాంక్ బండ్గా పిలువబడే బొబ్బిలి చెరువు వర్షపు నీటితో నిండుకుండలా మారింది. పూర్తిస్థాయిలో చెరువు నిండి నాగులపల్లి వాగు మీదుగా లింగారెడ్డిగూడ చెరువులోకి వర్షపు నీరు చేరుతున్నది. చెరువులోని చేపలు దిగువ ప్రాంతానికి వెళ్లకుండా మత్స్యకారులు అలుగు పారుతున్న చోట వలను ఏర్పాటు చేసి చేపలను పట్టి విక్రయించారు. వర్షపు నీరు వీధుల్లో నిలువకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.