తుర్కయాంజాల్/అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 27 : వడగండ్ల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి ఉమర్ఖాన్గూడ, అనాజ్పూర్లో ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్చతిన్న పంటలను రైతు బంధు సమితి అబ్దుల్లాపూర్మెట్ మండల కో ఆర్డినేటర్ కందాళ బలదేవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఉమర్ఖాన్గూడలో సుమారు 26 ఎకరాల్లో దెబ్చతిన్న వరి పంటను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి లక్ష్మణ్, నాయకులు గాలయ్య, శ్రీనివాస్రెడ్డి, శేఖర్, శివారెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అన్నదాతల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని లక్ష్మారెడ్డి అన్నారు. ఇటీవల వరి పంట నష్టపోయిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యం కారణంగా రైతులు కష్టపడి పండించిన పంటలు నష్టపోవడం బాధాకరమన్నారు. వరి దిగుబడిలో 33 శాతానికి పైగా నష్టపోయిన రైతుల వివరాలను ఎమ్మెల్యే కిషన్రెడ్డికి నివేదిస్తామన్నారు. తద్వారా జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. రైతులెవరూ దిగులు చెందవద్దని.. త్వరలోనే రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని ప్రభుత్వం జమ చేస్తుందని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో రైతులు జగన్, దానయ్య, రాఘవేందర్రెడ్డి, నరసింహరెడ్డి, స్థానిక నాయకులు విజయభాస్కర్రెడ్డి, రాములు, రవీందర్, వీఆర్ఏలు రాజు, ఉప్పల సత్తయ్య, కావలి సత్తయ్య ఉన్నారు.