మంచాల, డిసెంబర్ 26: మండలంలోని ఎల్లమ్మతండా గ్రామం చేనేత హస్తకళలకు వేదికగా మారింది. ఏ ఇంట్లో చూసినా గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా చేతులతో మహిళలు వస్ర్తాలను నేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారు నేసిన వస్ర్తాలనే వినియోస్తున్నారు. కాగా 2000 సంవత్సరంలో ఓ స్వచ్ఛంద సంస్థ వీరి ప్రతిభను గమనించి నీడిల్ వర్క్(సూదిపని) చేసేందుకు ప్రోత్స హించి, వారికి కొంత మెటీరియల్ను అప్పగించింది. దీంతో తండాలోని మహిళలు వస్ర్తాలను వివిధ రకాల్లో ఆకట్టుకునేలా తయారు చేయగా.. ఆ సంస్థ ఆ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించగా మంచి డిమాండ్ వచ్చింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. చేనేత హస్తకళకు పెద్దపీట వేసింది. వారిని ప్రోత్సహిస్తూ సహకా రం అందిస్తున్నది. వారికోసం గ్రామంలో ప్రత్యేకంగా స్త్రీ శక్తి భవనాన్ని కూడా ప్రభుత్వం నిర్మించింది.
నిడిల్ వర్క్లో శిక్షణ..
చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ఎల్లమ్మతండా, బోడకొండ, లోయపల్లి గ్రామాలకు చెందిన 100 మంది మహిళలకు రెండు నెలలపాటు అధికారులు నిడిల్ వర్క్(సూదిపని), అల్లికలపై శిక్ష ణ ఇచ్చారు. అనంతరం వారికి కుట్టుమిషన్లు, ఐరన్ బాక్స్లను ఉచితంగా అందజేశారు. నిడిల్వర్క్తో నేసిన వస్ర్తాలను నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్తోపాటు గోల్కొండ ఖాదీ వస్ర్తాలయంలోనూ విక్రయించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయిస్తామని శిక్షణ కాలంలో అధికారులు మహిళలకు తెలిపారు. దీంతో శిక్షణ పొం దిన మహిళలు వస్ర్తాలపై వివిధ రకాల బొమ్మలు, వస్తువులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఏ ఇంట్లో చూసినా మహిళలు ఉదయం నుంచే వస్ర్తాలపై వివిధ రకాల బొమ్మలను వేయడంలో నిమగ్నమవుతున్నారు.
జాతీయస్థాయిలో గుర్తింపు ..
గిరిజనుల సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా వీరు తయారు చేసే వస్ర్తాలకు మార్కెట్లో మం చి డిమాండ్ ఉండటంతో రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎల్లమ్మతండాకు మంచి గుర్తింపు లభించింది. గిరిజనులు వస్ర్తాలపై వివిధ రకాల బొమ్మలను నీడిల్వర్క్తో రూపొందించడంలో ఆరితేరారు. వీరు తయారు చేసిన వస్ర్తాలను పలు స్వచ్ఛంద సంస్థలు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రదర్శించడంతో అక్కడి వీక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వీరి ఉత్పత్తులను విదేశాలల్లోనూ ప్రదర్శించారు.
ప్రభుత్వ కృషి మరువలేము
కొన్నేండ్లపాటు తండాలోని గిరిజన మహిళలం తయారుచేసిన వస్ర్తాలు గ్రామస్థాయికే పరిమితమయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం హస్తకళలకు పెద్దపీట వేయడంతో మేము తయారుచేసిన గిరిజన వస్ర్తాలకు మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చింది. వస్ర్తాలపై వివిధ రకాల బొమ్మలేస్తూ ఉపాధిని పొందుతున్నాం. ప్రభు త్వ ప్రోత్సాహాన్ని మరువలేము.
– కేతావత్ లక్ష్మి,
ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
గత ప్రభుత్వాలు ఏనాడు కూడా గిరిజన సంస్కృతీసంప్రదాయాలను పట్టించుకోలేదు. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చిన వస్ర్తాలపై వివిధ రకాల అల్లికలు వేసి గిరిజన మహిళలు తక్కువ ధరకే విక్రయించేవారు. అయితే ప్రభుత్వం హస్తకళలకు పెద్దపీట వేయడంతోపాటు సహకారం అందిస్తున్నది. దీంతో తండాల్లోని మహిళలు వివిధ ఆకృత్తుల్లో తయా రు చేసిన వస్ర్తాలను నేరు గా నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించుకుని లాభాలు పొందుతున్నారు.
– సపావట్ పద్మ ,సర్పంచ్ ఎల్లమ్మతండా
నిడిల్ వర్క్తో ఉపాధి పొందుతున్నా
గతంలో నేను ఖాళీగా ఉం డటంతో నిడిల్వర్క్పై శిక్ష ణ తీసుకున్నా. ప్రస్తుతం నాకు ఆ వృత్తే ఉపాధిని కల్పిస్తున్నది. ప్రతిరోజూ ఇంటి వద్దే నిడిల్వర్క్ ద్వా రా వస్ర్తాలపై వివిధ రకాల బొమ్మలను తయారు చేసి విక్రయించుకుని జీవిస్తున్నా. – సపావట్ బుజ్జి, ఎల్లమ్మతండా