కొత్తూరు : మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన బీజేపీ నాయకులు మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. అందుకే పార్టీలో కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, యువత వచ్చి పెద్దఎత్తున చేరుతున్నారన్నారు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. రాష్ర్టానికి బీఆర్ఎస్ ఒక్కటే శ్రీరామరక్ష అన్నారు. పార్టీలో చేరిన వారిలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మైలానం రాఘవులుగౌడ్, మైలారం సిద్ధేశ్వర్గౌడ్, చింతకింది గణపతిగౌడ్, పసులాది నర్సింహగౌడ్ చేరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, కౌన్సిలర్ శ్రీనివాసులు, ఎంపీటీసీ పాల్గొన్నారు.
షాద్నగర్రూరల్ : ఎలికట్ట, హాజిపల్లి, వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. అభివృద్ధికి పట్టం కడుతూ.. వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లోకి చేరడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
వికారాబాద్ : బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం మంచి నిర్ణయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో పట్టణానికి చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు.
మోమిన్పేట : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మోమిన్పేట మండలంలోని దేవరంపల్లి, మోమిన్పేట కేంద్రానికి చెందిన బీజేపీ, ఎంఐఎం నాయకులు 100 మంది, ధారూరు మండలానికి చెందిన 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ధారూరు : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో ప్రతి పల్లె అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ధారూరు మండల పరిధిలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు అనిల్కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, నర్సింహులు, నితిన్, ప్రవీణ్కుమార్, మల్లేశం, మొగులయ్య, నవీన్కుమార్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పెద్దఅంబర్పేట : ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉన్నదని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోని 21వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం స్థానిక నేత కళ్లెం ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన 30 మందికిపైగా వివిధ పార్టీల నాయకులు కిషన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు.
బడంగ్పేట : అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్న నమ్మకంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ బీజేపీ నాయకులు, తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్న బీజేవైఎం నాయకులు మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్తీక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. కాలనీల్లో ఉన్న ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు.
పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు. మతం పేరుతో కులం పేరుతో ఓట్లు అడుగుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న వారిని గమనించాలన్నారు. రైతు బంధు వద్దు అంటున్న వారికి ఓట్లు వేస్తారా? 24 గంటల కరెంటు వద్దు.. మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న వారికి ఓట్లు ఎలా వేస్తారో ప్రజలు అడగాలన్నారు. 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ను ఆశీర్వదించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్నగర్, చింతలకుంట, ప్రశాంత్నగర్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజాల నాగేశ్, బాణావత్ మోతీలాల్, శ్రీను, లక్ష్మణ్, ఎ.శంకర్, కిరణ్, నర్సింగ్ తదితరులు చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జగన్రెడ్డి, గణేష్, వెంకట్రెడ్డి, మాధవరెడ్డి, బాలూనాయక్, బుజ్జి తదితరులున్నారు.
మహేశ్వరం : బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించబడుతుందని, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి సబితారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు 100 మంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మినాజ్ పటేల్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చాలా మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరినవారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మహేశ్వరం అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. పార్టీలో చేరినవారికి బీఆర్ఎస్ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు.
చేవెళ్ల రూరల్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల కమ్మెట గ్రామానికి చెందిన 100 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని. వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
శంకర్పల్లి: స్వరాష్ట్రం సాధించి కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందాయని చెవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించి, గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. అనంతరం కొండకల్ గ్రామంలోని 50 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
పరిగి, అక్టోబర్ 29 : సబ్బండ వర్ణాలు బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలో పూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 15 మంది ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు.
వరుసగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. పరిగిలో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఉన్నారు.