వికారాబాద్, ఏప్రిల్ 12: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటరుగా తమ పేర్ల ను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులు నూతనంగా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు ఏవైనా మార్పులు, చేర్పు లు ఉంటే సరి చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాను ఈ నెల 13న ఎంపీడీవో కార్యాలయంలో ప్రదర్శిస్తామని, మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను సమర్పించాలన్నారు. జిల్లాలోని 18 మండలాల్లో 566 గ్రామ పంచాయతీలుండగా, 187 పంచాయతీల పరిధిలో ఖాళీలుగా మారిన 9 ఎంపీటీసీలు, 9 సర్పంచ్లు, 335 వార్డుల ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బంట్వారంలో-2వార్డులు, బషీరాబాద్లో-1సర్పంచ్, 8 వార్డులు, 1ఎంపీటీసీ, బొంరాస్పే టలో-8 వార్డులు, ధారూరులో-69 వార్డులు, 4 ఎంపీటీసీలు, దోమలో- 9వార్డులు, 1 ఎంపీటీసీ, దౌల్తాబాద్లో-1సర్పంచ్, 5వార్డులు, కొడంగల్లో-5 వార్డులు, 1ఎంపీటీసీ, కోట్పల్లిలో-1వార్డు, కులకచర్లలో-1 సర్పంచ్, 15 వార్డులు, 1 ఎంపీటీసీ, మర్పల్లిలో-8 వా ర్డులు, మోమిన్పేటలో- 68 వార్డులు, నవాబుపేటలో-41 వార్డులు, 1 ఎంపీటీసీ, పరిగిలో-1 సర్పంచ్, 10 వార్డులు, పెద్దేముల్లో-1సర్పంచ్, 64 వార్డులు, పూడూరులో-1 సర్పం చ్, 4 వార్డులు, తాండూరులో-3 వార్డులు, వికారాబాద్లో-1 సర్పంచ్, 10 వార్డులు, యాలాల లో-2 సర్పంచ్లు, 5 వార్డుల్లో ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, డివిజినల్ పంచాయతీ అధికారి రాజేంద్రప్రసాద్, ఎన్నికల విభాగం తహసీల్దార్ శ్రీధర్, ఆయా సంఘాల నాయకులు అంజ య్య, మహేశ్కుమార్, గోపాల్రెడ్డి పాల్గొన్నారు.