డ్తాల్, ఏప్రిల్ 25 : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరే ఏ రాష్ట్రంలోనూ జరగడంలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయన్నారు. అన్ని రాష్ర్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తున్నాయని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు అందాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మండలంలోని గ్రామాలు, తండాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు.