వెల్దండ, నవంబర్ 6: కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో 50వేల మెజార్టీతో బీఆర్ఎస్అభ్యర్థి జైపాల్యాదవ్ గెలుపు ఖాయమని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్రనేత ఎడ్మసత్యం అన్నారు. సోమవారం వెల్దండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తిని ఐటీ హబ్గా మార్చడం, 3 కొత్త మండలాలు, ఆమనగల్లులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పడుతున్న కృషి అభినందనీయమన్నారు.
కేటీఆర్ సభకు దాదాపు 80 వేల మంది రావడమే జైపాల్యాదవ్ గెలుపునకు నిదర్శనమన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్రావు, సర్పంచులు వెంకటేశ్వర్ర్రావు, అంజీనాయక్, అంజయ్య, నాయకులు ఎడ్మవెంకట్రెడ్డి, బీమయ్యగౌడ్, మత్య్సశాక డైరెక్టర్ వెంకటయ్య, బాలు, మల్లయ్య, రాము, ఆనంద్, శివ, ఆర్కెగౌడ్, చలిచీమల, శ్రీను, రాజు, వెంకట్, గజిని శ్రీను, శంకర్, జంగు తదితరులు ఉన్నారు.
వెల్దండ నవంబర్ 6: మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో కుమ్మరి జంగయ్య సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో కల్వకుర్తి మున్పిల్ చైర్మన్ ఎడ్మసత్యం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్ధివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5 వేలు సాయం అందజేశారు. కార్యక్రమంలో పోతెపల్లి మాజీ సర్పంచ్ ఎడ్మ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోమయ్య, రవిగౌడ్, అశోక్, వెంకటయ్య, శేఖర్గౌడ్ ఉన్నారు.