పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పరిగిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ రంజిత్రెడ్డి ఆలోచనల ప్రతిరూపమే ఆర్ఆర్ ఫౌండేషన్ అని తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదువుకుంటేనే భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను త్వరలో ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు.
విద్యతోపాటు అనేక రంగాలలోను అభివృద్ది సాధించాలంటే ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. బాలురు సైతం ముగ్గులు వేయడం అభినందనీయమని అన్నారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాల్సి అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో విజేతలకు సీతా రంజిత్రెడ్డి, ప్రతిమారెడ్డిలు బహుమతులను అందజేశారు.
జూనియర్ కళాశాలలో గణితం అధ్యాపకుడికి నెలకు రూ. 5వేల చొప్పున అందజేస్తున్న జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్కుమార్రెడ్డిలను అధ్యాపక బృందం సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.