చేవెళ్లటౌన్, మార్చి 20: బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఒక్కొక్క అధికారి ఎజెండాలను చదివి వినిపించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు సభ దృష్టికి తీసుకరావడంతో గ్రామాల్లో నీటి సరఫరా పై తగు చర్యలు తీసుకోవడం జరిగిందని గ్రామీణ నీటి సరఫరా ఏఈఈ తెలిపారు. అలాగే గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని వైస్ ఎంపీపీ కర్నె ప్రసాద్తో పాటు పలువురు సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. గ్రామాల్లో చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా పూర్తి చేయాలని సూచించారు. మండలంలో విద్యుత్ కోతలు అధికంగా ఉన్నాయని, కోతలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, ఎంపీడీవో హిమబిందు, మండల విద్యాధికారి అగ్బర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.