బషీరాబాద్/మోమిన్పేట, మే 2 : స్థానిక ప్రజల కోరిక మేరకు నవాంద్గీ(బషీరాబాద్) రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్లతో కలిసి సికింద్రాబాద్లోని రైల్వే భవన్లో జీఎంను కలిసి పలు రైల్వే సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ జీఎంతో మాట్లాడుతూ..
ఎక్స్ప్రెస్ రైళ్లు నవాంద్గీ(బషీరాబాద్) రైల్వే స్టేషన్లో ఆపాలంటూ స్థానికులు నిరసన దీక్ష చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి స్థానిక ప్రజల కోరిక మేరకు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో బషీరాబాద్ మండలంలోని 30 గ్రామాల ప్రజలతో పాటు, కర్ణాటక రాష్ట్రంలోని ఆరు గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వెంటనే స్పందించిన జీఎం తమ శాఖ తరఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.