వికారాబాద్, జూలై 12 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మండల పరిధిలోని సిద్దులూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి పార్టీ కండువాలను కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశం చూపు మన రాష్ట్రం వైపు మళ్లించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఎంపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, నాయకులు వేణుగోపాల్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు, మండల ఉపాధ్యక్షుడు గఫార్, వెల్చాల్ సర్పంచ్ మధుసూదన్రెడ్డి, నాయకులు విజయ్కుమార్, షఫీ, గిరీశ్, సుభాష్, రవిశంకర్ ఉన్నారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
పరిగి : ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ సూచించారు. పరిగి మండలం మాదారం గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథం ద్వారా వైద్యసేవలను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు సహాయం చేసేందుకు, గడపగడపకు ఆరోగ్యం అందించేందుకు చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీ తెలిపారు. కంటి, మోకాళ్ల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తానని ఎంపీ చెప్పారు. వైద్య పరీక్షల సమయంలో ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చేవెళ్ల ఆరోగ్య రథం ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముందుగా పెద్ద గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 50 శాతం పైగా బీపీ రోగులు ఉన్నట్లు ఎంపీ తెలిపారు.
250 మందికి వైద్య పరీక్షలు
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనే ఎంపీ రంజిత్రెడ్డి చేవెళ్ల ఆరోగ్య రథం పేరిట గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రెండు మెడికల్ కళాశాలలు, ఒక ఆసుపత్రి ఉందని, వాటిలో ఉచితంగా వైద్యం అందనున్నట్లు తెలిపారు. ఎంత ఖర్చయినా ఎంపీ భరించి ఉచితంగా వైద్యం, ఆపరేషన్లు చేయించే బాధ్యతను తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వైద్య శిబిరంలో అన్ని పరీక్షలు నిర్వహించి రిపోర్ట్లు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్లు రాములు, మధుసూదన్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నాయకుడు మధుసూదన్ పాల్గొన్నారు.