చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 22 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని న్యాలట గ్రామంలో శివస్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల మహాపడి పూజా కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, అందరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
వివాహ వేడుకలకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే.
చేవెళ్లటౌన్ : ఊరేళ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాంచందర్ కుమారుడి వివాహం గురువారం చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకలకు ఎంపీ, చేవెళ్ల, బీఆర్ఎస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.