ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 9 : పారిశుధ్యం అందరి బాధ్యత అని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తుర్కగూడ, కప్పాడు ప్ర భుత్వ పాఠశాలల్లో పరిసరాలను శుభ్రం చే యించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలకు మండల పరిష త్ నిధుల నుంచి అందజేసిన డిజిటల్ సామ గ్రి, ఆట వస్తువుల పనితీరుపై విద్యార్థులను అ డిగి తెలుసుకున్నారు. ఉప్పరిగూడలో ప్రత్యేక అధికారి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలోని పరిసరాలను శుభ్రం చేయించారు. కా ర్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అ ధ్యక్షుడు భరత్రెడ్డి, ప్రత్యేక అధికారి వరప్రసాద్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, సైదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యాచారం : పరిసరాల శుభ్రతకు ప్రతి ఒ క్క రూ ప్రాధాన్యమివ్వాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యాచారంలో ర్యాలీ నిర్వహించారు. అనంత రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. హరితహారం మొక్కలకు పా దులు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, పం చాయతీ కార్యదర్శి తిరుపతయ్య, ఈజీఎస్ అ ధికారులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సి బ్బంది పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట ప్రత్యేకాధికారి, ఏవో కవిత అన్నారు. శు క్రవారం మూడోరోజు మండలంలోని కుత్బుల్లాపూర్, తారామతిపేట, గౌరెల్లిలో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, స్థానికులు అంతా కలిసి ప్రతి వీధినీ శుభ్రం చేసుకోవాలని, అప్పుడే వ్యాధులు దూరమవుతాయ న్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చేగూరి వెం కటేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో శ్రమదానం నిర్వహించారు. శుక్రవా రం మహిళా స్వయం సహాయక సంఘాల స భ్యులతో ఎంపీవో, గ్రామ ప్రత్యేక అధికారి వి ఠలేశ్వర్జీ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త సేకర ణ, ఉపాధి హామీ పనులు, పారిశుధ్య నిర్వహ ణ, స్వయం ఉపాధి, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం గ్రామ పరిసరా ల్లో శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలరాజ్, సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యు లు, గ్రామస్తులు పాల్గొన్నారు.