ఆమనగల్లు, ఏప్రిల్ 19 : మీ ప్రాంత బిడ్డనైన తనను లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఆర్ఎస్పీ సపోర్టర్స్ ఆర్గనైజర్ , ప్రవాస భారతీయుడు శ్రీధర్ గోవింద్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నామినేషన్ ఖర్చుల నిమిత్తం ‘ఒక్క రూపాయి ఆత్మీయ విరాళం’ పేరిట క్రౌడ్ ఫండింగ్ సేకరించారు. దీనిద్వారా వచ్చిన రూ.17500 విరాళాన్ని నామినేషన్ వేసేందుకు వెళుతున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గ ఓటర్లు పార్టీలకు అతీతంగా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లాలయ్యగౌడ్, కొమ్ము శ్రీనివాస్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సురమల్ల సుభాశ్, బండగల్ల చందు, మాజీ వార్డు సభ్యుడు జంతుక అల్లాజీ, నాయకులు రఘు, గండికోట శంకర్, కొమ్ము ప్రసాద్, విఠాయిపల్లి రమేశ్, ఏనుమల్ల రమేశ్, ప్రవీణ్, శంకర్, రాజు, మహేశ్, వరుణ్, రోహిత్, కిరణ్, సిద్ధు, రాజు, జగన్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.