అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘కోడ్’ ఉల్లంఘన జరుగకుండా పటిష్ట నిఘా పెట్టారు. జిల్లా నలుమూలలా 52 చెక్ పోస్టులతో పాటు ప్రతి నియోజకవర్గంలోనూ మూడు బృందాల చొప్పున ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్వాడ్, సర్వేలైన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా.. ఇప్పటివరకు సరైన పత్రాలులేని రూ.1.62కోట్లకు పైగా నగదును స్వాధీనపర్చుకున్నారు. ఎన్నికలపై సందేహాలు, ఫిర్యాదుల కోసం సీ-విజిల్, సువిధ యాప్లను, ఎన్జీఆర్ఎస్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ‘1950’ను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,500 ప్రాంతాల్లో వాల్ రైటింగ్, ఫ్లెక్సీలను తొలగించారు. అసెంబ్లీ ఎన్నికలపై రెండు రోజులుగా కలెక్టర్ హరీశ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): ‘అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా ప్రశాంతంగా ని ర్వహించేందుకు రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు పక్కాగా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేసి అక్రమాలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చే స్తున్నారు. జిల్లా నలుమూలలా చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. ప్రతి నియోజకవర్గంలో ఏ ర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్వ్యాడ్, సర్వేలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నా యి. రశీదులు లేకుండా తరలిస్తున్న రూ.1.62కోట్లకు పైగా నగదును ఇప్పటివరకు తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఎన్నికలపై సందేహాలు, ఫిర్యాదుల కోసం సీ-విజిల్, సువిధ యాప్లను, ఎన్జీఆర్ఎస్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చా రు. జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ‘1950’ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,500 ప్రాంతా ల్లో వాల్ రైటింగ్, ప్లెక్సీలను తొలగించారు.’
ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు 2014లో కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం దీన్ని ఆధునీకరించడంతోపాటు ఎఫ్ఎస్టీ(ఫ్లైయింగ్ స్కాడ్)తో అనుసంధానం చేసి ఈసారి ఎన్నికల్లోనూ అమలులోకి తెచ్చారు. ఏదైనా అక్రమానికి సంబంధించిన ఫొటోను యాప్లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలో అధికారు లు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తారు. యాప్లో చేసిన ఫిర్యాదు జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లైయింగ్ స్కాడ్కు చేరుతుంది. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదుల కో సం జిల్లా కలెక్టరేట్లోనూ ‘1950’ టోల్ ఫ్రీ నం బర్ను ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు అం దుబాటులో ఉంటుంది. రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ కార్యక్రమానికైనా అనుమతి తప్పనిసరి. ఇందుకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ విండో పద్ధతి లో 24 గంటల్లోనే అనుమతులు ఇస్తారు. అలాగే ఎన్జీఆర్ఎస్ పోర్టల్, ఇతర ఎన్నికలకు సంబంధించిన వెబ్సైట్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికలపై సందేహాలున్నా ఆన్లైన్లో సమాచారం తెలుసుకోవచ్చు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడంతోపాటు గతంలో కన్నా పోలింగ్ శాతం ఎక్కువ నమోదు అయ్యేలా చర్య లు తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా కలెక్టర్ హరీశ్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ అధికారులు, ఫ్లైయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేలెన్స్, వీడియో సర్విలియన్స్, వీడియో ఫ్లైయింగ్ స్కాడ్, పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో సమావేశా లు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘనటలు చోటుచేసుకోకుండా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రౌ డీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండోవర్ చేయడం తదితర చర్యలను ముమ్మరం చేస్తున్నారు.
జిల్లాలో ఎన్నికల అధికారులు అప్రమత్తమై ఎక్కడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగకుండా నజర్ పెట్టారు. నలుమూలలా 52 వరకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో మూడు బృందాల చొప్పున ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్వాడ్, సర్విలియన్స్ బృందాలు గట్టి నిఘాను ఉంచాయి. రేయింబవళ్లు డేగ కండ్లతో నిఘా పెట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.1,62,65,360 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదుకు సంబంధించిన పత్రాలు వెంటనే చూపకపోయినా.. తర్వాత జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో పత్రాలను సమర్పించి వారం రోజుల్లో నగదును తిరిగి పొందవచ్చు.