బషీరాబాద్, డిసెంబర్ 8 : ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాండూరు నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం లోనూ ఒక విజన్తో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి విరివిగా రుణాలను మంజూ రు చేయిస్తూ ఇప్పటికే వారి అభ్యున్నతికి దోహదపడుతున్నామని చెప్పారు. మండల కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కుట్టుశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశానని వెల్లడించారు.
ఈ ప్రాంతంలోని మహిళలు స్వయంశక్తితో ఎదగాలని, కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలనేదే తన విజన్ అని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శకుంతల, పార్టీ మండల అధ్యక్షుడు రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ రేఖాఠాకూర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్సింగ్తన్వార్, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి(రాజు), కో-అప్షన్ సభ్యులు రజాక్, తదితరులు పాల్గొన్నారు.