మోమిన్పేట : గ్రామాల్లో గంజాయి సరఫరా, సాగు నివారనపై సమిష్టిగా పని చేద్దామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూపర్ డీలక్స్ ఫంక్షన్ హాల్లో మండల ప్రజాప్రతినిధులకు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషేదిత మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించే క్రమంలో గ్రామా స్థాయి నుంచి జిల్లాల కేంద్రం వరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు యువతను కల్పుకొని సమన్వయంతో ముందకు సాగాలన్నారు. గంజాయి సాగు, సరఫరా, వినియోగించే ప్రణాళకా బద్ధంగా గంజాయి నిషేధానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో యువత మత్తు పదర్థాల జోలికి పోకుండా అవగాహన కార్యక్రమలు నిర్వహించాలాన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ తమ పిల్లలను క్రమశిక్షణగా నడుచుకోనేలా వారికి సమాజంపై, ప్రభుత్వ చట్టాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపరాదని, చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలోనో సీసీ కెమెరాలను పొందుపర్చుకోవాలని ఆయన అన్నారు. కావునా జిల్లా ప్రజలు నేర, గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో పోలీసులకు సహకారించాలన్నారు.
కార్యక్రమంలో మోమిన్పేట సీఐ వెంకటేశం, ఎస్సైలు విజయ ప్రకాశ్, రాజేంద్ర ప్రసాద్, విశ్వజన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, డీఎస్పీ సత్యనారాయణ, ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది, ఎంపీపీ వసంత, మోమిన్పేట, నవాబ్పేట, మర్పల్లి ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.