తలకొండపల్లి, డిసెంబర్ 9 : గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అన్ని వర్గాల వారు సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న అన్నారు. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్సీలకు జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మలతో పాటు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం రూ.40లక్షలతో నిర్మించిన తలకొండపల్లి పంచాయతీ కార్యాలయం, రూ.6లక్షలయాభై వేలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను సర్పంచ్ లలితాజ్యోతయ్యతో కలిసి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా తలకొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. గ్రామపంచాయతీ నిర్మాణానికి ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న రూ.10లక్షల నిధులు ఇవ్వడంతో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, సర్పంచ్లు లలిత, గోపాల్నాయక్, కిష్టమ్మ, రమేశ్యాదవ్, శ్రీశైలం, లక్ష్మణ్నాయక్, రఘుపతి, ఎంపీటీసీలు రమేశ్, హేమ, జె రమేశ్, మాజీ ఎంపీపీ రఘురాములు, వార్డు సభ్యులు విఠల్, ఈశ్వర్, స్వరూప, శ్రీను, కిష్మ, నాయకులు జ్యోతయ్య, శ్రీశైలం, యాదగిరి, రమేశ్, శ్రీనివాసులు, కృష్ణ, మల్లేశ్, రాములు, వెంకటయ్య, జంగయ్య, నర్సింహ పాల్గొన్నారు.