చేవెళ్ల రూరల్, నవంబర్ 26 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి, మడికట్టు, తల్లారం, దుద్దాగు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఊరెళ్లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్లలో పోటీ చేసే కాంగ్రెస్, బీజేపీ నాయకుల చరిత్ర తెలుసుకోవాలని, ఒకరిమీద కేసులు, మరొకరు పూటకో పార్టీ మారే వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
నేర చరిత్ర ఉన్న వాళ్లకే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు లింగంపల్లి అనూష, గూడెం సురేందర్, జహంగీర్, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, నాయకులు బాల్రాజ్, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, కావలి శేఖర్, మాణిక్యరెడ్డి, రాములు, శేఖర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నందిగామ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని బండకుంట, పెద్దకుంట, మధ్య కుంట తండాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచ్ వెంకట్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు.
కొత్తూరు : బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే సకల జనులకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్యాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలోని 12 వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ ఫలాలు ప్రజలకు అందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కడెంపల్లి శ్రీనివాస్గౌడ్, కౌన్సిలర్ సోమ్లానాయక్, రవినాయక్, రాజశేఖర్, బాలునాయక్, యాసిన్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు మండలంలోని మల్లాపూర్, రెడ్డిపాలెం గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బ్యాగరి సత్తయ్య, సురేశ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల ఎమ్మెల్యేగా కాలె యాదయ్య భారీ మెజార్జీతో గెలువడం ఖాయమని చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి అన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా యాదయ్యను మరోసారి గెలిపించాని కోరారు.