షాద్నగర్, డిసెంబర్1 : ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాన్ని అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజలు తమ పిల్లల వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంలో సీఎం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నదని చెప్పారు. ముఖ్యంగా రైతు బీమా, రైతు బంధు, ఆసరా పింఛన్లు వంటి పథకాలతో ప్రజలు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో మరింత విస్తరింపజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కొందుర్గు మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్రెడ్డికి రూ. 60 వేలు, పోలేపల్లి శ్రీనివాస్గౌడ్కు రూ. 12.5 వేలు, కొందుర్గు గ్రామానికి చెందిన గుంటి నర్సింహకు రూ. 16 వేలు, ఎండీ జహంగీర్కు రూ. 40 వేలు, కుమ్మరి శ్రీనివాస్కు రూ. 60 వేలు, ముట్పూర్ గ్రామానికి చెందిన అంజయ్యకు రూ. 60 వేలు, చిన్న ఎల్కిచర్ల గ్రామానికి చెందిన నవీన్కు రూ. 60 వేలు, పర్వాతాపూర్ గ్రామానికి చెందిన ముంతాజ్బేగానికి రూ. 48 వేలు, విశ్వనాథ్పూర్ గ్రామానికి చెందిన కుర్వ హన్మంత్కు రూ. 60 వేల చెక్కులను అందజేశారు.