షాద్నగర్రూరల్, జనవరి 04: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదల ఆర్థిక ఎదుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాలు, తండాల్లో పర్యటించి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి పార్టీలకు అతీతంగా ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను పలువురు సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధిలు, అధికారులు పాల్గొన్నారు.
కడ్తాల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కడ్తాల్, పల్లెచెల్కతండా, కొండ్రిగానిబోడుతండా, చరికొండ గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడ్తాల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. ప్రభుత్వం అభయహస్తం ద్వారా అందజేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అధికారులు ప్రతి దరఖాస్తు రశీదును కచ్చితంగా ఇవ్వాలని సూచించారు.
శంకర్పల్లి : ప్రజా పాలనలో భాగంగా మండలంలోని మోకిల గ్రామంలో దరఖాస్తులను డీఆర్డీవో ప్రభాకర్ పరీశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో 3,4,15 వ వార్డులలో దరఖాస్తులను చైర్పర్సన్ విజయలక్ష్మి స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుమిత్ర, ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీలోని 13,14,15 వార్డుల్లో , మండల పరిధిలో పోలేపల్లి గ్రామంలో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ వగ్గు బాల్రాం, ఎంపీడీవో ఫారూఖ్ హుస్సేన్, కమిషనర్ శ్యామ్సుందర్, ఏఈలు సీతారం, కృష్ణయ్య, ఎంపీవో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : చేవెళలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి వెంకట్రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో కారోబార్ నరేందర్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది యాదగిరి, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి రంగారెడ్డి జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో గురువారం మున్సిపాలిటీ చౌరస్తాలో ప్రజా పాలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాటల ద్వారా వివరించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ, కళాకారుల బృందం టీం లీడర్ యాదయ్య, కళాకారులు అనిల్, కృష్ణ, బృందం తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమం ఈనెల 6వరకు కొనసాగనుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటమ్మ, సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి పాల్గొన్నారు.
యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించారు. కుర్మిద్ద గ్రామంలో ప్రజాపాలనను ఎంపీడీవో విజయలక్ష్మి పరిశీలించి, గ్యారెంటీలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.