రంగారెడ్డి, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): ముస్లింలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంజాన్(ఈదుల్ ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రంతో 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, గురువారం పండుగ జరుపుకొంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
మహ్మద్ ప్రవక్త బాటలో నడుస్తూ, సమాజంలో పేదల ఆకలి బాధలు తెలుసుకుని, దాన ధర్మాలు చేసూ..్త దయాగుణం, సేవ, శాంతితో ముందుకు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు. ఈద్ను ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.