తాండూరు రూరల్, ఆగస్టు 11: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆర్సీ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్కాపూర్ గ్రామంలో 250 మంది వరకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్ మండలంలోని ధారునివాగుతండా గ్రామానికి చెందిన బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు మేఘనాథ్పవార్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని.. అందువల్ల అందరి చూపు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ని ఏ ఇతర రాష్ర్టాల్లోనూ అమలు కావడంలేదన్నారు. రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని.. అందువల్ల రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, మం డల పార్టీ అధ్యక్షుడు రాం దాస్, రావులపల్లి చంద్రశేఖర్గౌడ్, హసన్పటేల్, ఎంపీటీసీ సాయిరెడ్డి, ఉమాశంకర్, విజయ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు రాములు, శేఖర్ పాల్గొన్నారు.