కొడంగల్, నవంబర్ 2: సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో రామరాజ్యం సాగుతు న్నదని, కాంగ్రెస్ వస్తే దోపిడీ రాజ్యం తప్పదని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కస్తూర్పల్లి, ఇందనూర్, రావులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ సంక్షేమ పథకాలను అందుకోవడం లేదా అని ప్రశ్నించారు. పథకాలు అందుకుం టూ నే.. విమర్శించడం ఎంతవరకు సమంజసమని తెలిపారు.
కొడంగల్కు పక్కనే ఉన్న కర్ణా టక ప్రజలను అడిగితే కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉందే బట్టబయలవుతుందన్నారు. ఇచ్చి న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడానికి దమ్ము లేకపోయిందని, తెలంగాణలో ఇస్తామని నమ్మించడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. కొడంగల్లో గెలిచే పరిస్థితి లేదని రేవంత్, గుర్నాథ్రెడ్డితో దోస్తి కట్టినట్లు పేర్కొన్నారు. అధికారం కోసం రేవంత్ ఎంతటి నీచానికైనా పాల్పడతాడని తేలిందన్నారు. కాంగ్రెస్లో పీసీసీ పదవిని రూ.300లకోట్లకు కొనుక్కొని, ఇప్పుడు కాంగ్రెస్ సీట్లను అమ్ముకొని సొమ్ముచేసుకుం టున్నట్లు పేర్కొన్నారు.
పొరపాటున తెలంగాణను చేతిలో పెడితో అమ్ముకోవడం గ్యారంటీ అని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరికీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, నిజాయితీగా ఓటేసి మనం ప్రగతిని సాధించుం దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అందరి చూపు..బీఆర్ఎస్ వైపు ఉందని, బీఆర్ఎస్లో భారీ చేరికలతో కాంగ్రెస్ నాయకు ల్లో గుబులు ప్రారంభమైందని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. గురువారం నియోజక వర్గం లోని దౌల్తాబాద్ మండలంలోని చెన్నకేశవ ఫంక్షన్ హాల్లో మండలం లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్కు కాలం చెల్లిపోయిందన్నారు.
కాంగ్రెస్ను వీడి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు మద్దతు తెలపుతున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అధికారం బీఆర్ఎస్దేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కావడం ఖాయమన్నారు. ఎన్నికల మేనిఫెష్టోలో ఎంత అద్భుతమైన పథకాలు పొందుపర్చడం జరిగిందని, కాబట్టి కారును గెలిపించి అద్భుత పథకాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోహన్రెడ్డి, జడ్పీటీసీ కోట్ల మహిపాల్తో పాటు పకీరప్ప తదితరులు పాల్గొన్నారు