తాండూరు, డిసెంబర్ 9: ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని తాండూరు ఆర్టీసీ డిపోలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్ ప్రయాణం) పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సహాయం రూ.10 లక్షల పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. త్వరలో మిగితా పథకాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం సమత, ప్రజాప్రతినిధులు ఉన్నారు.