ఇబ్రహీంపట్నం, జూన్ 12 : శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటిస్థానంలో ఉన్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్రెండ్లీపోలీసింగ్ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో పాటు సీసీకెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నామన్నారు. ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇచ్చి 260మందికి పోలీసు ఉద్యోగాలు లభించాయన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావు, ఆర్డీవో వెంకటాచారి, మార్కెట్కమిటీ చైర్మన్ చంద్రయ్య, ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ యాదగిరి, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, ఆయా యువజన సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శాంతిభద్రత పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం
షాద్నగర్టౌన్ : దేశంలోనే నంబర్ వన్ సుపరిపాలనను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం షాద్నగర్ పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమాన్ని ఏసీపీ కుషాల్కర్, సీఐ నవీన్కుమార్, రూరల్ సీఐ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్తో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మినీ స్టేడియం వరకు నిర్వహించిన 2కే రన్ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసులు, డాక్టర్లు, యువకులు, వివిధ యూనియన్ల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసిందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ను ఏర్పాటు చేసి వారికి రక్షణ కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీలు వెంకట్రాంరెడ్డి, విశాల, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, సర్వర్పాషా, నర్సింహులు, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, కమిషనర్ వెంకన్న, ఎంపీడీవో వినయ్, ఎంఈవో శంకర్రాథోడ్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు మన్నె నారాయణ, నారాయణరెడ్డి, జూపల్లి శంకర్, నర్సింహులు, రఘునాథ్యాదవ్, కిషోర్, నందకిశోర్, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
నడకను దినచర్యగా మార్చుకోవాలి
కొత్తూరు : నడకను దినచర్యగా అలవర్చుకుంటే అనారోగ్యం దరిచేరదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొత్తూరు సీఐ బాలరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు చౌరస్తా నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు 2కే రన్ను సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవితంలో మనిషి శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమనే ఎక్కువగా పడుతున్నాడని అన్నారు. అందువల్ల అనారోగ్యానికి గురవుతున్నాడని చెప్పారు. ఈ అనారోగ్యం దరిచేరొద్దంటే ప్రతి రోజూ తప్పకుండా నడువాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య బీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, సత్యనారాయణ, కౌన్సిలర్ కొస్గి శ్రీనివాసులు, ఎంపీటీపీ రాజేందర్గౌడ్, సర్పంచ్లు రమేశ్గౌడ్, వెంకట్రెడ్డి, నాయకులు దేశాల జైపాల్, ఆంజనేయులుగౌడ్, రవీనాయక్ పాల్గొన్నారు.
శారీరక, మానసిక దృఢత్వానికి రన్నింగ్ దోహదం
చేవెళ్లటౌన్ : శారీరక, మానసిక దృఢత్వానికి రన్నింగ్ ఎంతో ఉపయోగ పడుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట చేవెళ్ల, ఆర్డీవో వేణు మాధవరావు ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. 2కే రన్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, ఇతరులకు పతకాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి సాగునీరు అందించడంతో తెలంగాణలో నేడు పంటలు అధికంగా పండుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ ప్రభాకర్ , జడ్పీటీసీ మర్పల్లి మాలతీకృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, సర్పంచ్లు బండారి శైలజాఆగిరెడ్డి, మోహన్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, నవాబుపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, చేవెళ్ల సీఐ వెంకటేశ్వర్లు, షాబాద్ సీఐ గురువయ్య గౌడ్, మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి, ఎస్సైలు అబ్దుల్ హయూమ్, ప్రదీప్కుమార్, ఐదు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవో రాజ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్ఐ రాజేశ్, మండల యూత్ అధ్యక్షుడు తొట శేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్, ఫాయాజ్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ప్రభుత్వ అధికారులు, పోలీస్సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలీస్శాఖ ఆధ్వర్యంలో పరుగు పందెం పోటీలు..
ఆమనగల్లు, మాడ్గుల : మండలంలోని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆమనగల్లు, మాడ్గుల, కడ్తాల్, తలకొండపల్లి మండల కేంద్రాల్లో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు, యువకులు, నాయకులకు పోలీసులు 2కే పరుగు పందెం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ ఉపేందర్, మాడ్గుల సీఐ కృష్ణమోహన్, ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఎస్సైలు సుందరయ్య, హరిశంకర్గౌడ్, వెంకటేశ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.