యాచారం, నవంబర్ 20 : కాంగ్రెస్కు ఓటేస్తే చివరికి మిగిలేది కన్నీళ్లేనని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, కేసీతండా, మాల్, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చింతపట్ల, మొండిగౌరెల్లి గ్రామాల్లో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. కిషన్రెడ్డి ప్రచారానికి గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాయకులు, కార్యకర్తలు ఆయనకు గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ…నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కావాలో..అరాచకాలు చేసే కాంగ్రెస్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. రైతులకు 24గంటల కరెంటు రావాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఐదేండ్లకోసారి ప్రజల ముందుకు వచ్చే మల్రెడ్డి రంగారెడ్డి మాటలకు మోసపోవద్దన్నారు.
ప్రజా ఆశీర్వాదంతో పట్నంలో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసి బీఆర్ఎస్కు భారీ మెజారిటీని అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాచ్ఛ భాష, సర్పంచ్లు విజయలక్ష్మి, మారు, సంతోష, కృష్ణ, ఎంపీటీసీ ఇస్రత్బేగం, నాయకులు కారింగు యాదయ్య, శంకర్నాయక్, యాదయ్యగౌడ్, జిల్లా రాములు, లక్ష్మీపతిగౌడ్, చిన్నోళ్ల యాదయ్య, ఖాజు, శంకర్గౌడ్, గోపాల్, వెంకటేశ్, దానయ్య, కిషన్, కార్యకర్తలు తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెలే ్యమంచిరెడ్డి కిషన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవటం కోసం మేము సైతమంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నారీమణులు. పేదప్రజలు, మహిళల సంక్షేమానికి నిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే మంచిరెడ్డి ఎంతో మంచి చేస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సోమవారం మహిళలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల పైఅవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ప్రతినిత్యం ప్రజల అభ్యున్నతితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడే మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కృపేశ్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు
మంచాల : ఇబ్రమీంపట్నం నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోడలు మౌనికారెడ్డి అన్నారు. చిత్తాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ సుకన్య, బీఆర్ఎస్ నాయకులు ఏర్పుల చంద్రయ్య, పెద్దిరాజు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మరోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావతిరెడ్డి కోరారు. 4వ వార్డు పరిధి పెద్దఅంబర్పేటలోని కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆర్కేనగర్లో కౌన్సిలర్ పాశం అర్చన ఇంటింటి ప్రచారం చేశారు.