తుర్కయాంజాల్, డిసెంబర్ 4 : మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి మునగనూర్ యాదాద్రి నగర్ కాలనీలో నిర్మించిన కమ్యూనిటీహాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కోకుండా రూ. 92 కోట్లతో మంచినీటి పైపులైన్ పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను అందజేసి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిలర్లు వేముల స్వాతి, సంగీత, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణ, నాయకులు విజయానంద్రెడ్డి, శ్రీనివాస్, మహేందర్, యాదాద్రి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు ఎమ్మెల్యే ఆటోగ్రాఫ్
యాదాద్రి నగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీహాల్ ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు కాలనీ చిన్నారుల మధ్య అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కమ్యూనిటీహాల్ ప్రారంభం అనంతరం బయలుదేరిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వద్దకు యాదాద్రి నగర్ కాలనీకి చెందిన చిన్నారులు తెల్ల కాగితంతో వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే చిన్నారులను దగ్గరకు తీసుకొని వారితో ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
అయ్యప్ప మహాపడి పూజలో..
కమ్మగూడ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని సూచించారు.
పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం
యాచారం : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన ఎట్టి నాగేంద్రబాబుకు రూ. 40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల ప్రధాన కార్యదర్శి భాష, సర్పంచ్ బండిమీది కృష్ణ పాల్గొన్నారు.