ఆదిబట్ల, నవంబర్ 25 : గతంలో ఎట్లా ఉన్న ఆదిబట్ల నేడు ఎంత అభివృద్ధి చెందిందో చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య ఆధ్వర్యంలో రాందాస్ పల్లి, చింతపల్లిగూడ, మంగల్పల్లి, సాహెబ్గూడ, బొంగుళూరు,ఆదిబట్ల, కొంగరకలాన్, కొంగరతండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదిబట్లకు ప్రపంచపటంలో చోటు దక్కించుకుందని అన్నారు. త్వరలోనే కొంగరకలాన్ గ్రామంలో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మిమ్మల్ని మాయమాటలతో మభ్యపెట్టే వారి మాటలను నమ్మవద్దని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గం కేవలం మంచిరెడ్డి కిషన్రెడ్డితోనే అభివృద్ధి చెందిందన్నారు.
ఎన్నికలప్పడే గ్రామాల్లోకి వచ్చే నాయకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తీగల కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి పొట్టి శ్రీకాంత్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కళమ్మ, కోఆప్షన్ సభ్యుడు పల్లె గోపాల్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కల్వకోలు రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు కంతి సంధ్య, నారని మౌనిక, మహేందర్, బీఆర్ఎస్ నాయకులు దండేం రాంరెడ్డి, జంగయ్య, రవీందర్, పాతూరి రాజేశ్, పోతురాజు రాజు పాల్గొన్నారు.
యాచారం : మండలంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో కారు జోరు పెంచింది. అన్ని గ్రామాలు వాటి అనుబంధ గ్రామాల్లో బూతుల వారిగా ఇంటింటికీ తిరుగుతూ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రచారంలో ఒక్కసారిగా కారు గేరు మార్చారు. ఎన్నికల ప్రచార ముగింపు సమయం దగ్గరపడుతుండటంతో నాయకులు, కార్యకర్తలు మంచిరెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం గడ్డ మంచిరెడ్డి కిషన్రెడ్డి అడ్డా అని బీఆర్ఎస్ మున్సిపాలిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు అశ్విని అన్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.2931 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొంతం యాదిరెడ్డి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి ఓటు వేయాలంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నోముల గ్రామంలో ఎమ్మెల్యే కోడలు మంచిరెడ్డి మౌనికారెడ్డి ప్రచారం నిర్వహించారు. నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ నాయకులు మొగిలి పావని, సుకన్య, అనిత, దందేటికార్ రవి, చిందకింది వీరేశ్, చింతకింది చక్రపాణి, జంగయ్య, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పెద్దఅంబర్పేటలో బీఆర్ఎస్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షుడు కంచర్ల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటరు వద్దకు వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని కోరారు.శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తట్టిఅన్నారం, ఇందు పల్లవి, ఆర్కేనగర్, మర్రిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఆయా ప్రచార కార్యక్రమాలకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వర్రెడ్డి, దేవిడి విజయ్భాస్కర్రెడ్డి, పాశం దామోదర్, బ్రహ్మానందారెడ్డి, రావుల గోపాల్గౌడ్, కౌన్సిలర్లు రోహిణిరెడ్డి, పాశం అర్చన, పరశురాంనాయక్, కోటేశ్వర్రావు, నాయకులు జాల సూరయ్య, సుక్క భిక్షపతి, పాశం పవన్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ మండలంలోని గడ్డమల్లయ్యగూడ గ్రామంలో ఆయన కోడలు మౌనికరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఆమె ఓటును అభ్యర్థించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అచ్చన దానయ్య తదితరులున్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపుకోసం ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరితోపాటు కౌన్సిలర్లు యాచారం సుజాత, మంద సుధాకర్, ముత్యాల ప్రసన్నలక్ష్మి, వార్తాకి జగన్, మమత, శంకరయ్య, శ్రీలత, అల్వాల జ్యోతి, సుల్తాన్, జొర్కోని బాల్రాజు, నీలం స్వేతతోపాటు పలువురు కౌన్సిలర్లు ప్రచారం ముమ్మరం చేశారు. కిషన్రెడ్డి కారు గుర్తు నమూనాతో ఓటర్ల వద్దకు వెళ్లారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే కిషన్రెడ్డి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించారని వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు.
మున్సిపాలిటీలో తాగునీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వంద పడకల ఆసుపత్రి, ఇండోర్ స్టేడియంతోపాటు నాగన్పల్లి- రాయ్పోల్ రోడ్ల విస్తరణతోపాటు సాగర్ రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి గెలిపిస్తే మున్సిపాలిటీ మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అల్వాల వెంకట్రెడ్డి, వేణుగోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.