తుర్కయంజాల్, నవంబర్ 26 : కాంగ్రెస్ పాలన అంటేనే అవినీతి పాలని అని, పథకాల కోతల పాలన అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఉమర్ఖాన్దాయర, కొహెడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కొహెడలో రూ.450 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ను నిర్మిస్తామని, ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైందని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సిద్దాల జ్యోతి, రైతుబంధు సమితి అబ్ధుల్లాపూర్మెట్ మండల కో ఆర్డినేటర్ కందాళ బలదేవరెడ్డి, నాయకులు బిందు రంగారెడ్డి, సామ శ్రీనివాస్రెడ్డి, బ్రహ్మచారి, గంగని శ్రీనివాస్, ఆంజనేయులు, బుడ్డ విజయ్ బాబు, తిరుమల్రెడ్డి, నాగిరెడ్డి,శీలం నర్సింహ, జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కనిపించే కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మి మోసపోద్దని అన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం తుర్కయంజాల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఉపాధ్యక్షుడు మల్లెల ఉపేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 100 మందికి పైగా యువకులు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
కార్యక్రమంలో బొక్క గోపాల్రెడ్డి, కౌన్సిలర్లు బొక్క శ్రీలత గౌతమ్రెడ్డి, రవీందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఏనుగు ఆనంద్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండికంటి రమేశ్, బుచ్చయ్య, గౌతమ్రెడ్డి, రవీందర్రెడ్డి, మల్లెల వంశీ, చిరంజీవి, మల్లెల జగదీశ్, ఇలీయాజ్, ధన్రాజ్, కొమ్ము రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల : వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కార్యక్రమంలో జగన్రెడ్డి, మొగిలి వెంకటేశ్, జంబుల కిషన్రెడ్డి, జ్ఞానేశ్వర్, మంత్రి నర్సింహ్మ, సత్యరారాయణ, ఏర్పుల నర్సింహ్మ, కాళ్ల శ్రీశైలం, బాల్రాజ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును కోరుతూ…ఆ పార్టీ నాయకులు చేపట్టిన ప్రచారం తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మరో నాలుగు మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం గడపగడపకూ వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఆ పార్టీ నాయకులు 24వార్డుల్లో ప్రచారం నిర్వహించారు
తుర్కయంజాల్ : బీఆర్ఎస్ శ్రేణుల ప్రచార జోరు మరింత పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యువజన విభాగం ఉపాధ్యక్షుడు కందాళ సురేందర్రెడ్డి మన్నెగూడలో ప్రచారం చేశారు. బావులు, పొలం వద్ద రైతుల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యాచారం : కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండలంలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. పదేండ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీని మూడో సారి అధికారంలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కౌన్సిలర్ తొండాపు రోహిణిరెడ్డి అన్నారు. 14వ వార్డు పరిధి మత్తుగూడ, శ్రీనివాసహిల్స్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంతో ఓటర్లకు అవగాహన కల్పించారు. అభివృద్ధి కోసం మరోసారి బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని కోరారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించిన ఘనత కిషన్రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రకమంలో బీఆర్ఎస్ నాయకులు బ్రహ్మానందరెడ్డి, కట్ట సందీప్గౌడ్, బుర్ర యాదగిరి, కప్ప సత్యం, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్లసంఘం జిల్లా అధ్యక్షుడు, తుర్కగూడ గ్రామంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డిల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది.