ఇబ్రహీంపట్నంరూరల్/పెద్దఅంబర్పేట, నవంబర్ 6 : నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నా రు. సోమవారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల గ్రామానికి చెందిన బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముసరిగారి రాజూగౌడ్తో పాటు మరో 30మంది అనుచరులు బీఆర్ఎస్ లో చేరారు. మంచాల మండలం దాద్పల్లి గ్రా మానికి చెందిన వంద మంది సీపీఎం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు.
పటేల్చెర్వుతండాకు చెందిన వంద మం ది సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 50మంది, మండలంలోని నాగన్పల్లి, దండుమైలారం గ్రామాలకు చెందిన 200మంది గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు వీరికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.