ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 30 : రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికి ముఖ్యమంత్రి సహాయనిధిని అందజేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలం కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు ఎల్లారెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే అందజేశారు.
అలాగే, కాంగ్రెస్పార్టీకి చెందిన మరో ఉపసర్పంచ్ స్వాతిరెడ్డికి రూ.56వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును కూడా ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలన్న లక్ష్యంతోనే పనిచేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వంలో ఆయాపార్టీలకు సంబంధించిన వారికి ప్రభుత్వం లబ్ధి చేకూరేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుగ్గ రాములు, అమరేందర్రెడ్డి, నిట్టు జగదీశ్వర్, మస్కు రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.